navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 6:49 am Digital Edition : NAVAGEETAM

అనాధ బాలికలకు అండగా ఉంటా.. జువ్వాడి నర్సింగ రావు.

వగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో తల్లి తండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఇద్దరు ఆడపిల్లలకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సియం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ రావు ఫోన్ ద్వార మాట్లాడి అనాధలైన ఆ ఇద్దరు ఆడపిల్లలకు ధైర్యం చెప్పారు వారికి అండగా ఉంటామని వారు చదువుకోడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏనుగు రాజారెడ్డి పొన్నం భూమానందం మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి మిట్టపల్లి నడిపి రాజారెడ్డి నేరెళ్ల రాజారెడ్డి నిమ్మల రాజేశం ఇనుగుర్తి వినోద్ మురళి సంతోష్ గుండోజి జనార్ధన్ ఎడమల నర్సారెడ్డి ఏనుగు రాజు బద్దం చిన్న రాజారెడ్డి ఎండి అకుర్ ఎలేటి రాజారెడ్డి బద్దం పెద్ద రాజారెడ్డి ముల్క గంగారం తదితరులు పాల్గొన్నారు