నవగీతం,జగిత్యాల
జగిత్యాల పట్టణంలోని 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడా కూడా సీసీ రోడ్డు డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం పనులు చేపట్టామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మన్సూర్, గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, హైమద్, బోడ్ల రాజు, చెట్పల్లి సుధాకర్ పాల్గొన్నారు.