ఆవోపా ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు
నవగీతం,మెట్ పల్లి: వసంత పంచమిని పురస్కరించుకొని మెట్ పల్లిలో శుక్రవారం ఆవోపా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో గల సరస్వతి మాత విగ్రహానికి ఆవోపా మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు బండారి సదాశివకుమార్ పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, పట్టణ అధ్యక్షుడు మైలారపు రాంబాబు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవోపా కార్యదర్శి పాoపట్టి అనిల్, ఎల్మీ రవి, దొంతుల లక్ష్మీనారాయణ, కోట...