navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 3:16 pm Digital Edition : NAVAGEETAM

ఎన్నికల పరిశీలకులను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

నవగీతం,జగిత్యాల:

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామరావు జగిత్యాల జిల్లాకు నియమించబడగా జగిత్యాల లోని అతిథి గృహంలో గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరిగే ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ,పోలింగ్ కేంద్రాలు,ఓటర్ల సంఖ్య,ఎన్నికలకు సంబంధించిన అన్నిరకాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.