navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:28 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కస్తూర్భా గాంధీ విద్యాలయాలకు దరఖాస్తుల ఆహ్వానం.

నవగీతం,ములుగు ప్రతినిధి.

ములుగు జిల్లా వాజేడు మండలంలోని వాజేడు కస్తూర్భా గాంధీ విద్యాలయాలనందు (కేజీబీవీ)విద్యనభ్యసించుటకు 6వ తరగతి నుండి ఇంటర్ మీడియాట్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడమైనదనీ, ఈయొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని వాజేడు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుజాత ఒక ప్రకటనలో తెలియజేశారు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు 6వ తరగతి 25సీట్లు, 7వ తరగతి 18సీట్లు,8వ తరగతి 13 సీట్లు,9వ తరగతి 9సీట్లు.10వ తరగతి 4సీట్లు మరియు ఇంటర్ మొదటి సంవత్సరం(సి.ఇ.సీ) 28సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం (ఎం.పి.హెచ్.డబ్ల్యూ.)28, ఇంటర్ రెండవ సంవత్సరం (సి.ఇ.సీ) 30సీట్లు, (ఎం.పి.హెచ్.డబ్ల్యూ) 30సీట్లు అందుబాటులో కలవనీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాజేడు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుజాత తెలిపారు. పూర్తి సమచారం కొరకు 9010117750 నంబరును సంప్రదించగలరనీ తెలియజేశారు.