జగిత్యాల మాజీ ఛైర్‌పర్సన్ జ్యోతి లక్ష్మణ్‌కు తమిళనాడు ఎన్నికల్లో కీలక బాధ్యతలు.

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్‌కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలు అప్పగించారు. వెలచ్చేరి శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సమన్వయకర్తగా ఆమెను అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.ఈ బాధ్యతల్లో భాగంగా పార్టీ కార్యక్రమాల సమన్వయం, స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయడం, ప్రచార కార్యక్రమాల రూపకల్పన అమలు, అలాగే రైతులు మరియు గ్రామీణ ఓటర్లకు పార్టీ విధానాలను చేరవేయడం వంటి కీలక అంశాలను ఆమె నిర్వహించనున్నారు. అదేవిధంగాకాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, రైతు...