navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 12:22 pm Digital Edition : NAVAGEETAM

టెట్ పరీక్షలు వాయిదా వేయాలి.

టి.జి.యు.యస్ అధ్యక్షులు నునావత్ రాజు.

నవగీతం, జగిత్యాల

జనవరి మాసంలో నిర్వహించనున్న టెట్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం టి జి యు యస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి జరుపుల గోవింద్ లు ప్రభుత్వాన్ని కోరారు.నెల రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిర్వహించిన ఉపాధ్యాయులు మరియు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు అవుతున్న సందర్భంగా టెట్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం లేనందున మనోవేదనకు గురవుతున్నట్లు అనేక సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు తమకు కటినంగా మారగా టెట్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని సన్నద్ధం కావడానికి సమయం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు.