navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 7:01 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ధర్మపురి కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా న్యాయవాది జాజాల రమేష్ నియామకం

నవగీతం,జగిత్యాల/ధర్మపురి:

తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జగిత్యాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి-కమ్-చైర్‌పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి సి. రత్న పద్మావతి ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌గా నేరేళ్ల గ్రామానికి చెందిన న్యాయవాది జాజాల రమేష్ ని నియమించారు. న్యాయవాది నియమించుకు నే ఆర్థిక సామర్థ్యం లేని వారికి గౌరవ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఉచిత న్యాయ సహాయం అవసరమైన అర్హులైన వారికి మాత్రమే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా న్యాయ సేవలు అందించబడతాయని తెలిపారు.