నవోదయ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం

నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశ పరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్‌ను జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.గుండంపల్లి గ్రామం నుండి తొలిసారిగా నవోదయ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవదీప్ సాధించిన విజయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, అతని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మనర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత నర్సయ్య, బెజ్జరపు...