navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 12:59 pm Digital Edition : NAVAGEETAM

పలువురికి యాదవ సంఘం ఘన సన్మానం

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల సబ్ ట్రెజరీ ఆఫీసర్ మానుక సత్యనారాయణ యాదవ్ ను, వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వెల్పుగొండ కుమార స్వామి యాదవ్ లను తెలంగాణ యాదవ మహాసభ ఉద్యోగుల సంఘ పక్షాన రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, అప్పాల గంగయ్య యాదవ్, బీనవేని గంగన్న యాదవ్ లు ఘనంగా శాలువాలతో సత్కరించి భగవద్గీతలను ప్రదానం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. బిసి ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలని, 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు.