navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 1:59 pm Digital Edition : NAVAGEETAM

పార్టీ ఫిరాయింపుల పై న్యాయం ఎక్కడ..?

దొగ్గలి శ్రీధర్

నవగీతం, కరీంనగర్:

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాత్రి రాత్రికే పార్టీలు మారిన వారికి టికెట్లు కేటాయిస్తూ గతంలో ఉన్న పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నారు , పార్టీలో సభ్యత్వం లేని వారికి వారి భార్యలకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. కనీస విలువలు పాటించకుండానే టికెట్లు కేటాయిస్తున్నారు ఎమ్మెల్యేలు పార్టీలు మారిన వారిని పార్టీ ఫిరాయింపుల పేరిట విచారణ ఎదుర్కొంటున్నారు. కానీ కార్పొరేషన్ ఎన్నికలలో సభ్యత్వం పొందకుండానే రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి అడ్డ అడ్డదారులు తొక్కుతున్నారు వీటన్నింటిని ఎలక్షన్ కమిషన్ గమనించాలి ఇలాంటి వారికి తగిన రీతిలో ఎలక్షన్ కమిషన్ బుద్ధి చెప్పాలని కోరారు. జెండాలు మోసే వారికి టికెట్లు ఇవ్వకుండా పార్టీలు మారిన వారికి టికెట్ ఇస్తూ జెండాలు మోసే వారికి అన్యాయం చేస్తున్నారు ఇలాంటి రాజకీయ పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతున్నాం