navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 3:18 pm Digital Edition : NAVAGEETAM

పోషణ పఖ్వాడా లో పోషక ఆహారంపై అవగాహన

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం లో అంగన్వాడీ కేంద్రం-6 లో పోషణ పఖ్వాడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మొదటి 1000 రోజల్లో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో  సమవేశం నిర్వహించి పోషక ఆహారం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమము లో  గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి మిల్లెట్స్ తో తియ్యని వంటకాలు చేసారు. ఐ.సీ.డీ.ఎస్ సూపర్వైజర్ శంకరమ్మ, ఉపసర్పంచ్ సోమ రెడ్డి,14 వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి, కాషవత్తుల లక్ష్మి, ముత్యాల గంగరాజం, ముష్కరి రమేష్, ఎనుగంటి నరేష్, ఎం.డీ షబ్బీర్, అరికుప్పల రాజం, శనిగారపు నరేష్, అల్లె చంద్రయ్య,మరిము అంగన్వాడీ టీచర్ లు గంగా భవాని,ఇందిర,రాధ, వసంత, రాధ, వసంత, మాట్ల బుచ్చయ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.