navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 2:06 am Digital Edition : NAVAGEETAM

బాధ్యతలు చేపట్టిన రాయికల్ మున్సిపల్ నూతన పాలకవర్గం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీ నూతన పాలక వర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది.మున్సిపల్ చైర్మెన్ గా కట్కం రవీందర్ మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతల స్వీకరించగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చైర్మెన్ కట్కం రవీందర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ యువ నాయకులు ఎల్ కార్తికేయ, కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.