navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 12:38 pm Digital Edition : NAVAGEETAM

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన సురభి నవీన్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల నియోజకవర్గ బిజెపి నాయకులు సురభి నవీన్ కుమార్ రెండోసారి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి, తనపై నమ్మకంతో పదునైన బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నవీన్ కుమార్ స్పష్టం చేశారు.ఒక సమర్థవంతమైన నాయకుడికి రెండోసారి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కడం పట్ల కోరుట్ల నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.