navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 11:53 am Digital Edition : NAVAGEETAM

మంత్రి తుమ్మల ని కలిసిన ఎమ్మెల్యే రాగమయి

నవగీతం, సత్తుపల్లి:

దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను శాసన సభ్యురాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని వార్డుల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించే విధంగా పార్టీ యంత్రాంగానే సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.