రాజ్యాంగానికి తూట్లు, దేశానికి చేటు

నవగీతం, హైదరాబాద్ బ్రిటిష్‌ వలస పాలన నుంచి విముక్తికి సాగిన స్వాతంత్రోద్యమ పోరాటం అనేకమంది బలిదానాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సారధ్యంలో సుమారు మూడేళ్లు అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి 1950లో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ విధంగా ఇండియన్‌ యూనియన్‌ సర్వసత్తాక సార్వభౌమ, లౌకిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదాన్ని (సోషలిస్ట్‌) చేర్చడం జరిగింది. స్వతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని 1950 జనవరి 26న...