navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 11:53 pm Digital Edition : NAVAGEETAM

రైతులకు ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారము కార్యక్రమం ల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ  మల్లాపూర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాక్స్ సెక్రెటరీ పాదం భూమేష్  ప్రజాపాలన ప్రణాళిక 99వ రోజుల్లో భాగంగా రైతు వారముకు సంబంధించి వివరించారు. అదేవిధంగా రైతులను సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి కె డి సి సి మేనేజర్ ప్రవీణ్  వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు ఏల్లాల జగపతి రెడ్డి   రైతులు తదితరులు పాల్గొన్నారు.