navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 10:57 pm Digital Edition : NAVAGEETAM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి మండలంలోని  మెట్ల చిట్టాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోగల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విట్టంపేట్ ,రంగారావుపేట్, రామ లచ్చక్కపేట్, ఆత్మకుర్,జగ్గసాగర్ , బండలింగాపూర్,రాజేశ్వరరావు పేట, గ్రామాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ధాన్యాన్ని చక్కగా అరబెట్టుకొని  అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని,సెంటర్ నిర్వాకులు నిబందనల ప్రకరం కొనుగోళ్లు చేయాలని సూచించారు. వారితో గ్రామ సర్పంచులు ,ఉప సర్పంచ్ లు, డిసిఓ మనోజ్ కుమార్ పి ఐ సి నిజాముద్దీన్ ఆర్ ఐ ఉమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ  డైరెక్టర్ లు మనల లింగారెడ్డి, పుప్పాల గంగాధర్  రైతులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు