విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శనివారం పరీక్షా ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. త్వరలో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కోరుట్ల ఇంచార్జీ సుమ మాట్లాడుతూ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రఘు చిట్నేని ఆధ్వర్యంలో సుమారు పాతిక సంవత్సరాలుగా...