navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:40 pm Digital Edition : NAVAGEETAM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన కంఠం రాజ్ కుమార్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును కాంగ్రెస్ నాయకులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్, మాజీ సర్పంచ్ లింగంపల్లి గంగాధర్, పుప్పాల పెద్ద గజేందర్, వీడిసి చైర్మన్ పుప్పాల చిన్న గజేందర్,భూస ప్రశాంత్ అమిలాల్ శ్రీనివాస్ దేశెట్టి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ సహాయం అవసర సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.