navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 2:30 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సుడా చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలి.. దొగ్గలి శ్రీధర్.

నవగీతం,రీంనగర్:

శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈసారి బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ , యువజన సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని అని చెప్పిన ప్రభుత్వం కరీంనగర్ కు ప్రతిష్టాత్మ అయిన సుడా చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంఘాల పక్షాన కోరుతున్నాం కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేసిన అధిష్టానం అగ్రవర్ణాల వారికే కేటాయించింది 52 శాతం ఉన్న బీసీలకు కరీంనగర్ లోని అన్ని రాజకీయ పార్టీలు గత ఎన్నికలలో టికెట్లు కేటాయించగా ఇక్కడి నుండి బీసీఏ ఎమ్మెల్యేగా విజయం సాధించారు నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా బీసీ గెలుపొందారు బీసీలలో రాజకీయ చైతన్యం కరీంనగర్ నియోజకవర్గంలో బాగా ఉంది కావున సుడా చైర్మన్ గా బీసీ నేమ్ నియమించాలని బీసీ సంఘాల పక్షాన కోరుతున్నామని తెలిపారు.