navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:14 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

హిందూ సమ్మేళనానికి భారీగా తరలి రావాలి

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం లో శుక్రవారం భరత మాత కూడలి వద్ద సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పెద్ద ఎత్తున నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమం కు ప్రజలు భారీ సంఖ్య లో హాజరు కాగలరని మల్లాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి మరియు ఉప సర్పంచ్ సోమ రెడ్డి సంయుక్తం గా గ్రామస్థులను ఆహ్వానించారు. మహిళలు మంగళ హారతులతో కార్యక్రమం కు రావాలని కోరారు.భారీ సంఖ్య లో మల్లాపూర్ ప్రజలు హాజరయి ఈ హిందూ సమ్మేళనం విజయవంతం చేయగలరని కోరారు.సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ఎర్ర భూమయ్య ఎగ్యారపు వెంకటేశ్వర్లు కాసారాపు భూమ రెడ్డి కళ్లెం మహిపాల్ రెడ్డి నూతిపెల్లి రాజం వార్డు సభ్యులు ముష్కరి రమేష్ మాసీట్ల గంగ నర్సయ్య ముద్దం శ్రీధర్ సాంబారి శంకర్ గజ్జెటీ నర్సయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.