navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 4:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఉత్తరద్వారా దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

నవగీతం, హైదరాబాద్

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని చిన్న తిరుపతిగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తరద్వారా దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జూబ్లీహిల్స్ టిటిడి అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయ చైర్మన్ ఏ వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉత్తరద్వారా దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జూబ్లీహిల్స్ టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 1: 30 నిమిషాల నుండి ఉత్తరద్వారా దర్శనం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటామని అన్నారు. స్వామివారిని భక్తులు క్యూలైన్లలో దర్శించుకుని సహకరించగలరని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ బాబు, మాజీ బోర్డు మెంబర్ రమణారెడ్డి, ఏఈ చల్మా,జితేందర్ రెడ్డి, ఆలయ సూపర్డెంట్ నిరంజన్, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.