navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 6:51 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

టిపియుఎస్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

నవగీతం, జగిత్యాల

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల విద్యావ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో రాష్ట్రఅసోసియేట్ అధ్యక్షులు ఏ. నరేందర్ రావు ఉపాధ్యక్షులు వి. రాజశేఖర్  ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా బాధ్యులు కస్తూరి శ్రీధర్ తీగల శ్రీనివాస్ భోగమల్లేశం మలహల్రావు రజినీకాంత్ రమేష్ రాజేశ్వర్ చంద్రశేఖర్ రవీందర్ రామకృష్ణ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.