నవగీతం, జగిత్యాల
పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏఆర్ ఎస్సైసయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి సేవలు మరువమని అన్నారు.పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు.అనంతరం పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్సై సయ్యద్ తకీద్దీన్ ని పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు కిరణ్ కుమార్, వేణు సిబ్బంది పాల్గొన్నారు