navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 11:31 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నిరసన

నవగీతం, చొప్పదండి

జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ అదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ,టీపీసీసీ పిలుపు మేరకు చొప్పదండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందుఆద్వర్యంలో మండల కేంద్రంలో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం, మండల నాయకులు నూతన సర్పంచులు ఉప సర్పంచ్ లు మార్కేట్ డైరెక్టర్స్  తదితరులు పాల్గొన్నారు