నవగీతం, నిర్మల్
నిర్మల్ జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ (డిఎల్ సి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఎడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్. సుదర్శన్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, రెవెన్యూ, ఇంజనీరింగ్,విద్యుత్ శాఖల అధికారులు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.