navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 11:38 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మహిళా భవనంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి పథకమైన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మరియు పట్టణ మహిళా స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు వ్రాయడం చదవడం నేర్చుకోవడం అమ్మకు అక్షరమాల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ మహిళలు అందరూ చదవడం రాయడం నేర్చుకోవాలని ఈ కార్యక్రమం నిర్దేశించిన పాఠ్యాంశాల వికాసం పుస్తకాలు సిలబస్ పూర్తి చేసుకుని తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ సిస్టం ద్వారా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కమిషనర్ టి మోహన్ ఏవో శ్రీనివాస్ గౌడ్ ఉల్లాస్ ప్రత్యేక అధికారి ప్రతాప్ రావు డీఎంసీ సునీత టీఎంసీ శివకుమార్  సిఓ జ్యోతి మహిళా సంఘ సమాఖ్య సంఘ ప్రతినిధులు పద్మ,లత తదితరులు పాల్గొన్నారు