నవగీతం, జగిత్యాల
జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ తో నిరుపేదల కళ్ళలో ఆనందం పేదల సొంతింటి కల సాకారం అయిందని అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను జగిత్యాల కు మంజూరు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల ప్రత్యేక అధికారి డా.నరేష్,యంపిఓ రవి బాబు,ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.