నవగీతం,జగిత్యాల:
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన రూ.30 లక్షల 3 వేల విలువగల చెక్కులను, మండలానికి చెందిన 5గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. వారి వెంట మండల నాయకులు,సర్పంచులు, ఉప సర్పంచ్ లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.