నవగీతం, రాయికల్
రాయికల్ మండలంలోని కుమ్మరిపెల్లిలో పంచతి గంగారెడ్డి శనివారం సాయంత్రం పొలంలో పనులు చేస్తూ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆదివారం రోజు దుబాయికి ప్రయాణం చేయాల్సిన వ్యక్తి.. నిన్న సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. దీంతో కుమ్మరిపెల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలతో శోక సముద్రంగా మారింది.