నవగీతం,వెల్గటూర్:
వెల్గటూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు..ఈ సందర్బంగా సర్పంచ్ బిళ్ళకూరి తిరుపతి మాట్లాడుతూ ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోని, సకాలంలో అందరూ విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ బిళ్ళకూరి తిరుపతి, ఉపసర్పంచ్ అల్లం శ్రీనివాస్, వార్డు సభ్యులు అల్లం జగదీష్, బిళ్ళకూరి వేణు, సుద్దాల సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు