నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, కోశాధికారి పడిగేల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రామ్ దాస్, క్రీడా కార్యదర్శి బిగుల్లా శంకర్, కార్యవర్గ సభ్యులు గజభీంకర్ వెంకటేష్ ఉన్నారు.