టిటిడిలో ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయండి – టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు
నవగీతం, తిరుపతి టిటిడిలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ అమరావతి వేంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీ ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా టిటిడి కల్యాణ మండపాలపై...