నవగీతం,మల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కనుముల వెంకటేష్ ఆధ్వర్యంలో ఓటర్ డే సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రలోభాలకు లొంగద్దు అని నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, కొత్తగా ఎవరైతే 18 ఏళ్ళు నిండిన అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి వేల్పుల సురేష్, ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి, బిఎల్వోలు యాదగిరి సంధ్య, వేముల పద్మావతి, ఆశా కార్యకర్తలు జమున రాణి, శారద, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.