నవగీతం ,వైరా:
వైరా రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కార్మిక చైర్మన్ కే శ్రీనివాసరెడ్డికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా టీయూ డబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్ ను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సంఘం నాయకులు ఏపూరి రాజారావు, ఎక్కిరాల శ్రీనివాసరావు, అక్కిశెట్టి రవితేజ, సూతకాని శ్రీకాంత్, గొల్లమందల విజయ్, హతావుళ్ళ, సీతారాములు, ప్రశాంత్,మహేష్, నాగరాజు, వాక్దాని శ్రీకాంత్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు