నవగీతం ,వెల్గటూర్ :
వెల్గటూర్ మండలంలోని స్తంభంపెల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వాల్ పోస్టర్ ను ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ధర్మపురి మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు .ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,ఆలయ ధర్మకర్తలు అవ్వ సాయి క్రిష్ణ,చెన్న వినోద్, సర్పంచ్ భూపల్లి రాజయ్య, ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్, యూత్ నాయకులు ప్రశాంత్, యాదవ సంఘము నాయకులు కొమురయ్య, ఆలయ మాజీ చైర్మన్ పాకాల నరేష్ గౌడ్,మార్కెట్ డైరెక్టర్ సప్ప లింగయ్య ,పాదం అంజిత్ తదితరులు పాల్గొన్నారు