నవగీతం, మెట్ పల్లి
తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 26 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను మరియు పోలింగ్ స్టేషన్ ల వారిగా తుది ఫోటో ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డు యందు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, కే.నాగేశ్వరరావు, మేనేజర్ వెంకటలక్ష్మి, డిపిఓ రాజేంద్ర ప్రసాద్, టి పి ఎస్ అశోక్, ఆరో మీర్జా అజ్మతుల్ల బెగ్, ఐ సి శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, జే ఏ ఓ రమేష్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.