నవగీతం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గా ఆయన అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.