నవగీతం,కొడిమ్యాల.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ధైవా ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా పిలుస్తారు. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభమవుతుందని శాస్త్రోక్తంగా భావిస్తారు.వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.