navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 10:46 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యాభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయం

నవగీతం,కోరుట్ల రూరల్

విద్యాభివృద్ధి కోసం ముందుకు వచ్చి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. సోమవారం కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో నిమిషకవి నవీన్ -దివ్య, గోనె సురేందర్ – మేఘనలు శిశుమందిర్ లో రెండు అదనపు తరగతి గదుల కోసం సొంత నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరు నిమిషకవి నవీన్ -దివ్య, గోనె సురేందర్ – మేఘనలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిమిషకవి నవీన్ -దివ్య, గోనె సురేందర్ – మేఘనలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేనిలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయిలాపూర్ గ్రామ ఉపసర్పంచ్ వనపర్తి సౌమ్య క్రాంతి, విద్య పీఠం కరీంనగర్ ఇంచార్జీ కాటం రవీందర్, జిల్లా కార్యదర్శి బండారి కమలాకర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేముల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం, కోరుట్ల అధ్యక్షుడు వేముల రవి కిరణ్, స్థానిక నాయకులు రమేష్, మురళి రాములు, గోపి, రాజు, సురేష్, సుదర్శన్, తుకారం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.