నవగీతం, ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామం లో గత కొన్ని నెలల క్రితం విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న మెట్ పల్లి కి చెందిన సంబారి హరీష్ కరెంట్ స్తంభం పై నుండి ప్రమాదవశాత్తు పడటంతో వెన్నుపూస కి గాయం అయి చికిత్స పొందుతున్నాడు. అతడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకున్న వేములకుర్తి పంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీకాంత్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అతని మిత్రుల సహకారంతో సేకరించిన రూ.15000 లను గురువారం హరీష్ కు అందజేశారు. విరితో మిత్రులు మాదం మహేష్ గాంధారి శ్రీకాంత్ ఉన్నారు