నవగీతం,తిరుపతి
సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గురువారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేదపండితులు పాల్గొన్నారు.