నవగీతం,చొప్పదండి:
చొప్పదండి పురపాలక సంఘ ఎన్నికలలో భాగంగా 1వ, 2 వ వార్డుల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున పోటీ చేస్తున్న వడ్లూరి సరిత, కొట్టె సునీత తరుపున తొగరిమామిడికుంటలో ఇంటింటి ప్రచారం లో చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.