navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 1:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

నవగీతం,ఇల్లంతకుంట :

ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాలకు రహదారులకు అనుసంధానం చేస్తూ ,వాటిని చదును చేసి వాహనదారులకు మంచి రహదారులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు , సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని ముస్కాన్ పేట- తాళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారిని ఉపాధి హామీ ద్వారా వేసేందుకు పనులను ప్రారంభించారు. రెండు గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధి హామీ ద్వారా చదును చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల పెల్లి గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి రచన వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు , ఉపసర్పంచ్ ఎలుక రామస్వామి,ఏఎంసి డైరెక్టర్ సుధగోని తిరుపతి గౌడ్, వార్డు సభ్యులు బోడ కమలాకర్ రెడ్డి, పల్లె తిరుపతి రెడ్డి ,సింగిరెడ్డి మహేందర్ రెడ్డి, బొల్లావేణి కుంటయ్యా, కాటేపెల్లి వెంకరెడ్డి ,సామా భాగ్య రెడ్డి, సుధగోని రాములు, జుట్టునర్సయ్య తదితరులు పాల్గొన్నారు.