జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు – ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మెట్‌పల్లి చెక్‌పోస్ట్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ నవగీతం,మెట్ పల్లి: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ  ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న వాహన తనిఖీలను పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని...