నవగీతం, హైదరాబాద్:
హైదరాబాద్ రవీంద్రభారతిలో విమల సాహితీ సమితి,తెలంగాణ సాంస్కృతిక శాఖ,సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి డా.జెల్ది విద్యాధర్,సిరికొండ నరసింహారావు, రచించిన “యుద్ధం శాంతి “పుస్తక ఆవిష్కరణలో నంగునూర్ మండలనికి చెందిన రచయిత, కవి దేవులపల్లి రమేశ్,దేశామా నీకు ఇదేవందనం అనే కవిత గానం చేసినందుకు గాను సాహిత్య సేవలు అందించినందుకు ముఖ్యఅతిధి పద్మ శ్రీ కులకలూరి ఇనాక్, డాక్టర్ గోరేటి వెంకన్న, డా. బిక్కికృష్ణ, డా.రాధా కుసుమ, చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో దేవులపల్లి రమేశ్ ను ఘనంగా సన్మానించారు. కవి రమేశ్ మాట్లాడుతూ.తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు భాష గొప్ప తనం మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.నాళేశ్వర శంకరం, శిఖామణి, కవులు,రచయితలు తదితరులు పాల్గొన్నారు.