స్టాక్ బోర్డు స్టాక్ రిజిస్టర్ ప్రతిరోజు రాయాలి
నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ ,రేగుంట, సిరిపూర్ వివిధ గ్రామాలలో శుక్రవారం పురుగు మందుల దుకాణాలను వ్యవసాయ అధికారి లావణ్య తనిఖీ చేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు తప్పనిసరిగా అనుమతి పత్రాలు అన్ని కూడా అందరికి కనిపించే విధంగా గోడకు తగిలించాలని, స్టాక్ బోర్డ్ , స్టాక్ రిజిస్టర్ ప్రతి రోజు వ్రాయాలి, ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ప్రతి నెల ఒకటవ తేదీన మీ క్రయవిక్రయాలను వ్రాత పూర్వకంగా వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలి అన్నారు.

బిల్లులో రైతు సంతకాలు తీసుకోవాలి అని తెలిపారు. పురుగు మందుల దుకాణాలలో సరైన ధ్రువపత్రాలను లేనందున లింగారెడ్డి ఫర్టిలైజర్ లో రూ.1,50,000 లు, రాహుల్ ఫెర్టిలైజర్ రేగుంట లో రూ.12,150 లు సిరిపూర్ రైతు డిపో లో రూ.4500 లు, విలువైన పురుగుమందులను నిలుపుదల చేయుటకు నోటీసు జారీ చేసామని తెలిపారు.