నవగీతం,మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హుటాహుటిన మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులతో మాట్లాడి వారికి భరోసా అందించారు. ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.