అ అక్షరంగా కూర్చున్న విద్యార్థులు
నవగీతం, మల్లాపూర్:
అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ మండలం మోగిలి పెట్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో అ అక్షరంగా విద్యార్థులు కూర్చొని మాతృ భాషపై మమకారాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు కృష్ణవేణి, రాజేందర్, సుమిత్రదేవి, మంజుల, రుచిత, సంధ్యలు పాల్గొన్నారు.